మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మే 3వ తేదీ వరకు ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. అందరూ సహకరించాలని కోరారు. కరోనాపై భారత్ యుద్ధం బలంగా కొనసాగుతుంది. కష్టమైనా, నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారు. దేశం కోసం వాళ్ల కర్తవ్యన్ని నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో వుయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారు. అంబేడ్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయి. ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబెడ్కర్కు ఇచ్చే నివాళి.
లాక్డౌన్ నిబంధనల ఉండగానే ఉగాధి నుంచి విశూ వరకు పండుగలు జరుపుకున్నాం. భారత్ అంటేనే భిన్న మతాలు, సంస్కృతులు, ఉత్సవాలు. లాక్డౌన్ నేపథ్యంలో అందరూ పండగలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రజలంతా ఒక్కటై నిలబడి పోరాడుతున్నారు. సమస్య మన దృష్టికి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. కరోనాను వీలైనంత త్వరగా కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను అమలు పరిచాం. అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్ ఎంతో కొంత మంచి స్థితిలో ఉంది. ఈ సందర్భంగా పోల్చడం సరికానప్పటికీ మన స్థితిని మనం అంచనా వేసుకోవాలి. యూరప్, అమెరికాలో వేల మంది మృత్యువాత పడుతున్నారు. అంది ఎంతో భాధ కలిగించే విషయం. లాక్డౌన్ నిబంధనలు నికచ్చిగా అమలు చేయగలకపోతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేం.